47 పెండింగ్‌ చలాన్ల వాహనం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

47 పెండింగ్‌ చలాన్ల వాహనం పట్టివేత

Apr 20 2024 1:45 AM | Updated on Apr 20 2024 1:45 AM

జగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్‌, ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రాయికల్‌ మండలంలోని కిష్టంపేటకు చెందిన జనార్దన్‌ తన బైక్‌పై వస్తుండగా ఆపారు. ఆ వాహనంపై 47 పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లు గుర్తించి, సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో యజమాని జనార్దన్‌ మొత్తం రూ.12,805 చెల్లించి, సంబంధిత రసీదును పోలీసులకు అందజేయడంతో వాహనాన్ని అప్పగించారు.

రూ.12,805 చెల్లించిన యజమాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement