మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు

Jun 22 2025 4:00 AM | Updated on Jun 22 2025 4:00 AM

మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు

మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బోనాల్‌ గ్రామంలో శనివారం మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలను జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 58 మందికి వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈత కొట్టడం, వల విసరడం, పాండ్రి వల లాగడం తదితర మెలకువలు తెలిపారు. అనంతరం శ్రీపతి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యువజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహకార అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, మత్య్స సహకార పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు గాదం సత్యనారాయణ, జిల్లా తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు బట్టు విఠల్‌, బెస్త సాయిలు, మండల అధ్యక్షుడు దాసరి సాయికుమార్‌, మత్య్సకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement