
యోగాతోనే ఆరోగ్య సమాజం
కామారెడ్డి అర్బన్: ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ చందర్ అన్నారు. పట్టణంలోని జిల్లా యోగా భవన్లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాచరు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించగా, ఆయుష్ ఆధ్వర్యంలో సరస్వతి విద్యామందిర్లో నిర్వహించిన కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ చందర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన పూర్వీకులు అందించిన యోగాకు ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యోగా సెంటర్లు పెరగడం ఆరోగ్యసమాజానికి నిదర్శనమన్నారు. కామారెడ్డి డివిజనల్ అటవీ అధికారి రమేష్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వంటశాల ఆరోగ్యశాల కావాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్క నాటడడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రాణవాయువు అందుతుందన్నారు. ఆయుష్ డీపీఎం శ్రీకాంత్, నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్యులు దేవయ్య, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రతినిధులు అంజయ్య, యెల్లంకి సుదర్శన్, యోగా గురువు అంజయ్యగుప్తా తదితరులు పాల్గొన్నారు. మోహర్బాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో యోగాకు ఆధ్యాత్మిక తోడు కావాలని పలువురు ఆశ్రమాధిపతులు అన్నారు. యోగా గురువు బండి రాములు స్వయంగా కఠినమైన ఆసనాలు వేశారు. ఆర్యసమాజంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులుతో పాటు పట్టణ, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో యోగాకు
అంతర్జాతీయ గుర్తింపు
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
జిల్లాకేంద్రంలో అట్టహాసంగా
యోగా దినోత్సవం

యోగాతోనే ఆరోగ్య సమాజం

యోగాతోనే ఆరోగ్య సమాజం