‘ధరణి’లో మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘ధరణి’లో మౌలిక వసతులు కల్పించాలి

Jun 23 2025 6:06 AM | Updated on Jun 23 2025 6:06 AM

‘ధరణి’లో మౌలిక వసతులు కల్పించాలి

‘ధరణి’లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి అర్బన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధి లోని ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక వసతులు కల్పించాలని టౌన్‌షిప్‌ బాధితులు డిమాండ్‌ చేశారు. ఆదివారం టౌన్‌షిప్‌ సమీపంలోని గెలాక్సీ ఫంక్షన్‌లో హాల్‌లో టౌన్‌షిప్‌లో ప్లాట్లు కొనుగోలు చేసినవారు సమావేశమయ్యారు. అనంతరం టౌన్‌షిప్‌ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అధికారులు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పడంతో ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేశామన్నారు. మూడేళ్లవుతున్నా ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క నీస వసతులు కూడా లేకపోవడంతో నివాసం ఉండలేకపోతున్నామని, కొత్తగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే కనీస వసతులు క ల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని హె చ్చరించారు. సమావేశంలో ధరణి టౌన్‌షిప్‌ బాధితుల సంఘం ప్రతినిధులు పి.రాజనర్సింహారెడ్డి, న రాల వెంకట్‌రెడ్డి, జశ్వంత్‌రావు, కై లాస్‌ రాజేశ్వరరా వు, బి.అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement