
ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: పాఠశాలలపై పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ ఉపాధ్యాయులకు అ ప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభు త్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఆర్పీ ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయ ణ డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్ర కారం ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా ని యమించే అధికారం లేదని పేర్కొన్నారు. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీ)లకు పూర్తి స్థాయి పాఠశాల పర్యవేక్షణ అధికారాలు ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరారు.
రైతుల సమస్యలు
పరిష్కరించాలి
మాచారెడ్డి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పాల్వంచ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు రాములు, మనోహర్ రెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్కు
తరలిరావాలి
కామారెడ్డి అర్బన్: కొత్త పెన్షన్ చట్టాన్ని వ్యతి రేకిస్తూ ప్రధాన మంత్రికి కలెక్టర్ ద్వారా అందజేసే పెన్షనర్ల మహాజరుపై సంతకం చేయడానికి విశ్రాంత ఉద్యోగులు తరలిరావాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయమై అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతురెడ్డి, విజయరామరాజు, రాష్ట్ర సలహాదారు లచ్చయ్య ఒక ప్రకటన వి డుదల చేశారు. పెన్షనర్ల సంతకంతో కూడిన లేఖను సోమవారం సాయంత్రం 4 గంటల కు కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు.
జూనియర్ కళాశాల కోసం భవనం పరిశీలన
బీబీపేట : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం స్థానికంగా ఉన్న ఓ భవనాన్ని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఆదివారం పరిశీలించారు. భవన నిర్మాణం మరో వారం రోజుల్లో పూర్తవుతుందని షేక్ సలాం పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తామన్నారు. కళాశాలలో ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. విద్యార్థులు సోమవారంనుంచి తరగతులకు హాజరు కావాలని సూచించారు.
వర్షపు నీరు రోడ్లపైకి
రాకుండా చూడండి
● ప్రభుత్వ సలహాదారు
పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ : పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై కి రాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించా రు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ముందు డ్రెయినేజీలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని ఇటీవల ఆగ్రో ఇండస్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ దగ్గరుండి తీయించారు. ప్రధాన రహదారి పక్కన డ్రెయినేజీల్లో తీసి న చెత్తాచెదారాన్ని ఆదివారం పోచారం పరి శీలించారు. డ్రెయినేజీలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలకు సూచించారు.
రేపు చలో
తెలంగాణ యూనివర్సిటీ
భిక్కనూరు: చలో డిచ్పల్లి తెలంగాణ యూ నివర్సిటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు పూర్వ జేఏసీ అధ్యక్షుడు పీబీ.సత్యం తెలిపారు. ఆదివారం ఆయన భిక్కనూరులోని సౌత్ క్యాంపస్లో మాట్లాడారు. పీహెచ్డీ పూర్తి చేసినవారికి తెలంగాణ వర్సిటీ ద్వితీయ కాన్వొకేషన్ రోజున పట్టాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు భరత్, రమేష్, శ్రీనివాస్, పాండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి