భూ తగాదాలతోనే వస్త్రల వ్యాపారిపై దాడి | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాలతోనే వస్త్రల వ్యాపారిపై దాడి

Jun 23 2025 6:14 AM | Updated on Jun 23 2025 6:16 AM

బిచ్కుంద(జుక్కల్‌): మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణం యజమానిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భూ తగాదాల కారణంగానే దాడి జరిగినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఎస్సై మోహన్‌రెడ్డి ఆదివారం వివరాలను వెల్లడించారు. ఈనెల 15న బిచ్కుందలోని ఓ వస్త్రాల షాపులో యజమాని శేక్‌ ఖలీల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో అతడి కి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణా ల్లో విచారణ చేపట్టారు. ఖలీల్‌కు అతడి బంధువులైన షేక్‌ అమన్‌ కుటుంబ సభ్యుల మధ్య కొన్నేళ్ల నుంచి భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఖలీల్‌ను చంపి భూమి స్వాధీనం చేసుకోవాలని షేక్‌ అమన్‌, కుటుంబ సభ్యులు ప్లాన్‌ వేశారు. నాందేడ్‌ ప్రాంతానికి చెందిన ముబీన్‌, రితేష్‌, వైభవ్‌, సుషాంత్‌ నలు గురు వ్యక్తులకు రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చి ఖలీల్‌ ను హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నారన్నా రు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. షేక్‌ అమన్‌ కుటుంబ సభ్యులు పారారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు.

నిందితులను పట్టుకున్న పోలీసులు

వివరాలు వెల్లడించిన

బిచ్కుంద ఎస్సై మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement