
బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలి
కామారెడ్డి అర్బన్: జిల్లాలో బీఎస్పీ బలోపేతం కోసం నాయకులు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. పట్టణంలో శనివారం పార్టీ జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంతోష్, మనోహర్లను బీఎస్పీలో చేర్చుకున్నారు. జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి సిద్ధిరాములు, రోహిదాస్, ప్రభాకర్దాస్ పాల్గొన్నారు.
మహిళలు
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
బాన్సువాడ రూరల్: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందిస్తారని చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యామ్సుందర్లు అన్నారు. బాన్సువాడ మండల కార్యాలయంలో శనివారం ఏపీఎం రాజేందర్, పద్మలతో కలిసి డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పా రిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్పేనియర్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఈఏపీ) కృషి చేస్తోందన్నారు. పరిశ్రమలశాఖ, పేదరిక నిర్మూలన సంస్థలతో ఒకరోజు ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఔత్సాహిక మహిళల ను గుర్తించి వారికి 15రోజుల పాటు పరిశ్రమ ల నిర్వాహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెళకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు.
విద్యుత్ను పొదుపుగా వాడాలి
బాన్సువాడ రూరల్: ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడాలని విద్యుత్ శాఖ డీఈ ప్రభాకర్ అన్నారు. మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా డీఈ మాట్లాడుతూ.. రైతులు సొంతంగా విద్యుత్ మరమ్మతులు చేయరాదన్నారు. ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాన్ని తగ్గించడానికి, లూజ్లైన్ను తొలగించడానికి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. 9మంది రైతుల బోరుబావుల వద్ద కెపాసిటర్ బ్యాంక్లను అమర్చారు. ఈడీఈ సంజీవ్రావు, ఏఈ అనిల్కుమార్, లైన్మన్ అక్తర్, ఏఎల్ఎం నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బడి బాగు కోసం కృషి చేయాలి
మాచారెడ్డి: చుక్కాపూర్ బడి బాగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ జెడ్పీటీసీ, పాఠశాల పూర్వ విద్యార్థి మినుకూరి రాంరెడ్డి అన్నారు. పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావడానికి త్వరలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మానందరెడ్డి, మమత, దేవేందర్రావు, నాగేందర్ ఉన్నారు.

బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలి

బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలి

బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలి