
మొరం దందాకు బీజేపీ వ్యతిరేకం
బిచ్కుంద(జుక్కల్): అక్రమ మొరం దందాకు బీ జేపీ వ్యతిరేకమని పార్టీ మండల అధ్యక్షుడు శెల్పల్లి విష్ణు అన్నారు. బిచ్కుందలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిచ్కుందకు చెందిన బీ శ్రీరాం అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తగా చెలామణి అవుతూ అక్రమ మొరం రవాణాకు పాల్పడుతున్నాడన్నారు. అతడి తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లెటర్ ఇచ్చినట్లు శ్రీరాం చెప్పుకుంటున్నాడన్నారు. కానీ ఇలాంటి ఫేక్ లెటర్లను నమ్మవద్దని కోరారు. నాయకులు జాదవ పండరి, శివాజీ పటే ల్, గణపతి, ధర్మనాయక్ తదితరులు పాల్గొన్నారు.