
యోగా ఫ్యామిలీ..
ఎల్లారెడ్డి: జంగమాయిపల్లి గ్రామానికి చెందిన సంగ్లుగారి నాగరాజుగౌడ్ కుటుంబానికి యోగాతో విడ దీయలేని అనుబంధం ఉంది. కుటుంబ సభ్యులు యోగా నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తున్నారు. నాగ రాజు గౌడ్ హరిద్వార్ వెళ్లి బాబా రాందేవ్ ఆశ్రమంలో యోగా నేర్చుకున్నారు. కొన్నేళ్లుగా గ్రామంలో ఉ చితంగా యోగా నేర్పిస్తున్నారు. ఆయన భార్య సు జాతకు యోగా నేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆయు ష్ విభాగంలో యోగా ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుమారు డు మధుగౌడ్ సైతం యోగా నేర్చుకున్నా డు. ప్రస్తుతం హైదరాబాద్లోని సెయింట్మేరి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న మధు.. హైదరాబాద్లోని మానసిక రోగులకు ప్రతిరోజు యోగా నేర్పిస్తున్నాడు. నాగరాజు గౌడ్ కూతురు సంతోషిణి సైతం తండ్రి బాటలో పయణిస్తోంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హరిద్వార్లోని ఆచార్యకులంలో చదివి యోగాలో అత్యున్నత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో గోల్డ్మెడల్ను సాధించింది. ఇలా కుటుంబం మొత్తం యోగా నేర్చుకుని ఆదర్శంగా నిలుస్తోంది.

యోగా ఫ్యామిలీ..