
మురికి నీరు నిల్వ ఉండకుండా చూడండి
లింగంపేట(ఎల్లారెడ్డి): పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. శుక్రవారం పలు గ్రామాల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. గ్రామ పంచాయితీ సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గాంధారి(ఎల్లారెడ్డి): వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నాగరాజుతో కలిసి ఎంపీడీవో మండల కేంద్రంలో వీధుల్లో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు.
భిక్కనూరు: మండల వ్యాప్తంగా భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు యెమిమా ఎంపీహెచ్ఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటా తిరిగి నిల్వ ఉన్న నీటిని పారబోయించారు.
బీబీపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీబీపేట కార్యదర్శి రమేష్ అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే సందర్భంగా గ్రామంలోని ఆయా కాలనీల్లో సందర్శించారు. కుండీల్లో నీటిని తొలగించాలని దానివల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు.
జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలని మండల పంచాయితీ అధికారి మలహరి సూచించారు. శుక్రవారం భవానిపేట సబ్ సెంటర్లో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రోగులను గుర్తించి మందులు పంపిణీ చేయాలని సూచించారు. పలు సూచనలు, సలహాలిచ్చారు.