
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మద్నూర్(జుక్కల్): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురువులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా శుక్రవారం యోగా వాక్, విద్యార్థులు, గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. యోగాతో కలిగే లాభాలను పతాంజలి యోగాపీట్ సభ్యులు వివరించారు.
విద్యుత్ సరఫరాలో
అంతరాయం
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు కారణంగా శనివారం బిచ్కుందలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ పవన్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ప్రజలు అధికారులకు సహకారం అందించాలని కోరారు.
సామూహిక అక్షరాభ్యాసం
సాక్షి నెట్వర్క్: లింగపేట మండలం అయిలాపూర్ ప్రాథమిక పాఠశాలలో, నాగిరెడ్డిపేట మండల వదల్పర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం చిన్నారులకు పలకలు, నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం