
జీవితంలో యోగా తప్పనిసరి
బాన్సువాడ: ప్రతి ఒక్కరి జీవితంలో యోగా తప్పనిసరి కావాలని యోగా శిక్షకులు రఘువీర్ గురూజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా శిక్షకులు, పతంజలి ప్రతినిధి రఘువీర్ గురూజీని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో ఆయా మండలాల్లో యోగాపై విస్తృత ప్రచారం చేశామన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతో పాటు మానసిన దృఢత్వం ఏర్పడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లను మార్చుకోవడంతో పాటు ధ్యానం చేయడం కూడా చాలా ముఖ్యమన్నారు. చిన్నప్పటి నుంచే యోగా, సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన ఉండాలని అన్నారు. 600లకు పైగా వివిధ ప్రాంతాల్లో యోగాపై ఆయన శిక్షణ ఇచ్చారు. రఘువీర్ గురూజీతో పాటు ఆయన సతీమణి వేదశ్రీ కూడా మహిళలకు యోగాసనాలు వేయించారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో పతాంజలి ఆయుర్వేద మూలికల దుకాణం ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలో ఔషధాలను అమ్ముతారు.
14 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్న రఘువీర్