
పరుగుతో ఆరోగ్యం మెరుగు
● ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
కామారెడ్డి అర్బన్: మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యానికి నడక, పరుగు ఎంతో ఉపయోగపడుతుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన మద్ది చంద్రకాంత్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో 39వ ఒలింపిక్ డే రన్ను గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఇందీరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, ఆర్డీవో వీణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ కై లాస్ శ్రీనివాస్రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ కన్వీనర్, కో–కన్వీనర్లు నల్లవెల్లి కరుణాకర్రెడ్డి, ఆర్ వెంకటేశ్వర్గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డీఈవో రాజు, యువజన, క్రీడల జిల్లా అధికారి జగన్నాథన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.