
గంజాయి రవాణా కేసులో ఇద్దరి అరెస్టు
మోర్తాడ్(బాల్కొండ): గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు భీమ్గల్ సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. మోర్తాడ్ నుంచి దోన్పాల్ వెళ్లే మార్గంలో విశ్వసనీయ సమాచారంతో మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తనిఖీలు చేప ట్టారు. మోర్తాడ్కు చెందిన పిట్టల సంతోష్, వడ్యాట్లో నివాసం ఉంటున్న నెల్లూర్ జిల్లాకు చెందిన బకీర్ గిరిబాబులు గంజాయి రవాణా చేస్తున్నట్లు సందేహం వచ్చి పోలీసులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద 10 చిన్న ప్యాకెట్లలో రూ.5వేలు విలువ చేసే 100 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. మరో కవర్లో రూ.7,500ల విలువ చేసే 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ట్రాలీ ఆటోను, రూ.8,600ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైలు విక్రమ్, అనిల్రెడ్డిలు పాల్గొన్నారు.