
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన మేఘావత్ మోహన్, భార్య లక్ష్మీ, కూతురు శిరీషలు ఈనెల 14న తిరుపతికి దైవ దర్శనం నిమిత్తం నిజామాబాద్ రైల్యేస్టేషన్ నుంచి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో వారి కుటుంబసభ్యుడు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వారి సమాచారం తెలిస్తే 87126 59782, 87126 59874 నంబర్లకు అందించాలని సూచించారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అదృశ్యం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అదృశ్యం