
కారు బోల్తా: ముగ్గురికి గాయాలు
వర్ని: మండలంలో ని కొనిపూర్ క్యాంప్ శివారులో గురు వారం జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ సురేష్తోపాటు పట్నం కుమా ర్, సాలె వెంకటి ముగ్గురు కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో కొనిపూర్ క్యాంప్ శివారులో వారి కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టి, పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో కుమార్, వెంకటికి కాళ్లు విరగగా సురేష్కు స్వల్ప గాయాలు అయ్యాయి. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి
రాజంపేట: మండల కేంద్రంలో ఓ బాలుడిపై వీధి కుక్కల దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరా లు ఇలా.. రాజంపేటలోని గడ్డమీది మహేష్, సంతోషిల కుమారుడు నిధ్విత్ (నాని)(6) బుధవారం సా యంత్రం ట్యూషన్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా కొద్ది దూరం వెళ్లగానే వీధి కుక్కల గుంపు దాడికి పాల్పపడ్డాయి. దీన్ని గమనించిన తల్లి సంతోషి కుక్కలను తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఆమె పైకి కూడా దాడి చేయడానికి యత్నించా యి. అప్పటికే పలువురు కాలనీవాసులు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమికొట్టారు. అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో వీధి కుక్కల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గుర్తుతెలియని వృద్ధురాలి ఆత్మహత్య
ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్, ఎస్సై తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని కిలోమీటర్ నెంబర్ 460/10 వద్ద ఒక గుర్తు తెలియని వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి వయస్సు సుమారు 60ఏళ్లు ఉంటాయని తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదన్నారు. ఎవరికై నా ఆమె వివరాలు తెలిస్తే రైల్వే ఎస్సై 87126 58591కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

కారు బోల్తా: ముగ్గురికి గాయాలు

కారు బోల్తా: ముగ్గురికి గాయాలు