
క్రైం కార్నర్
శతాధిక వృద్ధురాలు మృతి
మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండాలో శతాధిక వృద్దురాలు దస్లీబాయి (105) గురువారం మృతి చెందారు. దీంతో తండాలోని పలువురు గిరిజనులు శోకసముద్రంలో మునిగిపోయారు. నాటితరం వృద్ధురాలైన దస్లీబాయి గిరిజన తెగ సంప్రదాయాలను విస్మరించకుండా కొనసాగించటంలో పట్టుదలతో ఉండేవారని తండావాసులు విషాదవదనంతో తెలిపారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు గిరిజన సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె కుమారులు, మనమలు, మునిమనుమళ్లు, మనుమరాళ్లు కడసారి వీడ్కోలు పలికారు. దస్లీబాయి భర్త బలరామ్నాయక్రెండు దశబ్ధాల క్రితమే మృతి చెందాడు.
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి: నగరంలోని రైల్వేస్టేషన్ మెయిన్గేట్ వద్ద మురికికాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. ఈనెల 17న సాయంత్రం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ పక్కన గల మురికి నాలాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకొని అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరిశీలించగా మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50నుంచి55ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతుడు తెలుపు రంగు, బ్లూకలర్ షర్ట్, గోధుమ కలర్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఎవరికై నా అతడి సమాచారం తెలిస్తే ఎస్హెచ్వో ఫోన్ నెంబర్ 8712659714కు సమాచారం అందించాలన్నారు.
ముప్కాల్ మండలంలో..
బాల్కొండ: ముప్కాల్ మండ లం నల్లూర్ గ్రామ ఊర చెరువులో గురువారం గుర్తు తెలి యని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇ లా.. స్థానికులు చెరువులో మృతదేహం ఉన్నట్లు స మాచారమివ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మ ధ్య ఉంటాయన్నారు. అతడు బూడిద కలర్ ప్యాంట్, ఆకుపచ్చ రంగు షర్టు వేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్

క్రైం కార్నర్