
ఆర్మూర్ నుంచి తిరుమలకు వెళ్లే జెండా
మీకు తెలుసా?
ఆర్మూర్: పట్టణంలోని వేంకటేశ్వర (జెండా బా లాజీ)ఆలయం నుంచి తిరుమల వరకు పాదయాత్రగా తీసుకువెళ్లే జెండా పండుగను శ్రావణ మాసంలో ఆనవాయితీగా నిర్వహిస్తారు.
● 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న జెండా పండుగను తిరుపతికి వెళ్లలేని భక్తుల కోసం నిజాం నవాబుల కాలంలో అంకాపూర్ దొర గడ్డం వెంకట భూమారెడ్డి హయాంలో ప్రారంభించినట్లు ప్రతీతి.
● నిజాంలు జెండా పండుగ నిర్వహణకు ఎన్నో అడ్డంకులు కల్పించే వారని పెద్దలు చెబుతుంటారు. వాటిని అధిగమిస్తూ నేటికీ ఈ పండుగను, జాతరను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
● జెండా జాతర కోసం తొమ్మిది రోజుల ముందు జెండా కర్రకు 20 మీటర్ల పట్టు బట్టలను ఆర్మూర్లో నేసి జెండాపై ఉంచి దానిపై ఓం గుర్తును పెడతారు.
● శ్రావణ శుద్ద తదియ రోజున జెండాను ప్రతి ష్ఠించిన అనంతరం తొమ్మిది రోజుల పాటు జెండాకు పూజలు నిర్వహిస్తారు.
● అనంతరం ఆర్మూర్లోని జెండా మందిరం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అప్పగిస్తారు.
● అంకాపూర్లో శ్రావణ శుద్ద ఏకాదశి నుంచి భాద్రపద శుద్ద చవితి వరకు 22 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
● వినాయక చవితి తెల్లారి అంకాపూర్ గ్రామస్తులు జెండాను జక్రాన్పల్లి మండలం అర్గు ల్ వరకు తీసుకెళ్తారు. ఈ జెండాను గతంలో ముడుపులు కట్టి గ్రామంలో ఊరేగిస్తూ కాలి నడకన తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేర్చేవారు. ప్రస్తుతం వాహనంలో తరలిస్తున్నారు.