
కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎల్లారెడ్డి: మండలంలోని మల్లయ్యపల్లిగేట్ వద్ద నిర్మిస్తున్న పోచారం కాలువ బ్రిడ్జి గుంతలో కారు పడిన ప్రమాదంలో మృతికి కారణమైన కాంట్రాక్టర్పై కఠిన చర్యలను తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. గురువారం బ్రిడ్జి నిర్మాణ ప్రదేశంలో రాస్తారోకో చేశారు. కారు ప్రమాదంలో లునావత్ పీర్యా, కెతావత్ పీర్యాలు మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే కారు గుంతలో పడి ప్రమాదానికి గురైందని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఎస్సై మహేష్, సీఐ రవీందర్నాయక్లు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సముదాయించడంతో వారు రాస్తారోకో విరమించారు.

కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి