
అమ్మా.. ఆరోగ్యం బాగుందా?
నస్రుల్లాబాద్: ‘‘అమ్మా ఆరోగ్యం బాగుందా?’’ అంటూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నెమ్లి వెల్నెస్ సెంటర్లోని రోగులను పలకరించారు. వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. బుధవారం ఆయన వెల్నెస్ సెంటర్ను తనిఖీ చేశారు. వైద్యులు అందిస్తున్న సేవలను గమనించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో మాట్లాడి వెల్నెస్ సెంటర్లో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట సబ్కలెక్టర్ కిరణ్మయి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఎంపీడీవో సూర్యకాంత్, ఆరోగ్య శాఖ సిబ్బంది రవీందర్, సుశీల, స్రవంతి ఉన్నారు.
రెవెన్యూ సదస్సులో..
భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం నెమ్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూ సర్వే చేపట్టి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట సబ్కలెక్టర్ కిరణ్మయి, మండల ప్రత్యేకాధికారి దయానంద్, తహసీల్దార్ సువర్ణ, ఆర్ఐ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.