
ఘనంగా యోగా దినోత్సవం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. యోగా టీచర్లు చైతన్య, స్రవంతి, అజయ్, ప్రిన్స్ప ల్ సురేఖ, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మర్కల్ స్టేజీ వద్ద గల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా డే నిర్వహించారు.
ఈ సందర్భంగా యోగ శిక్షకురాలు భార్గవి మాట్లాడుతూ...ప్రతి విద్యార్థి చదువుతో పాటు యోగా నేర్చుకోవాలన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. సదాశివనగర్ ఆయుశ్ వైద్యాధికారి నాహిద, కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.