
మోసపూరిత మాటలను నమ్మొద్దు
నిజాంసాగర్(జుక్కల్): అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. బుధవారం మాగి గేటు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్ మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. స్తానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జుక్కల్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారన్నారు. నాయకులు ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్, లక్ష్మయ్య, బాల్సాయిలు, తదితరులున్నారు.
మోదీ పథకాలను ప్రజలకు వివరించాలి
దోమకొండ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసిన, చేస్తోన్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కుంట లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం దోమకొండలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనంతరం గ్రామ బీజేపీ అధ్యక్షుడిగా ముత్తి బుచ్చి రాజును ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, కార్యదర్శి అంజిరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నేతలు మహేందర్గౌడ్, తిరుపతిరెడ్డి మహేందర్రెడ్డి, తదితరులున్నారు.