
‘మా పాఠశాలను దొంగల బారి నుంచి కాపాడండి’
రాజంపేట: తమ పాఠశాలను దొంగలబారి నుంచి కాపాడాలని కోరుతూ రాజంపేట బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం ఈశ్వరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉన్న ఓ బాత్ రూం డోరును రెండు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు అపహరించగా మంగళవారం రాత్రి మరో బాత్రూం డోరు సైతం అపహరణకు గురైందని తెలిపారు. అలాగే పాఠశాల ఆవరణలో ఉన్న నల్లాల ట్యాబ్లు పలుమార్లు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. పాఠశాల ఆస్తులను కాపాడుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, పిల్లల తల్లిదండ్రులు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చోరీ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.