
క్రైం కార్నర్
వివాహిత ఆత్మహత్య
రెంజల్(బోధన్): మండలంలోని వీరన్నగుట్ట గ్రా మానికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. గ్రామానికి చెందిన భువనేశ్వరి(40) మానసిక పరిస్థితి బాగోలేక బాత్రూంలోని ఇనుప పైపులకు ఉరేసుకుని మంగళవా రం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు వెంటనే నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భువనేశ్వరి మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో పడి మరొకరు..
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రానికి చెందిన సూదం గంగామణి (52) స్థానిక చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. భర్త మందలించాడని మనస్తాపంతో మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గంగామణి బుధవారం పోతంగల్ గ్రామ చెరువులో మృతదేహమై కనిపించింది. కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.