
బ్రిడ్జి గుంతలో పడిన కారు
ఎల్లారెడ్డిరూరల్: మల్లయ్యపల్లి శివారులో పోచారం ప్రధాన కాలువపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో కారు ప్రమాదవశాత్తూ పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నర్సింగ్రావుపల్లి తండాకు చెందిన పీర్యా తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి నిజామాబాద్ జిల్లా పెద్దగుట్టకు కారులో వెళ్తుండగా మల్లయ్యపల్లి వద్ద పోచారం కాలువ బ్రిడ్జి నిర్మాణ గుంతలో పడింది. పెద్దగుట్టలో శుక్రవారం రోజున కందూరు చేసుకునేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పీర్యా తన తమ్ముడు వేణుతో పాటు ఇద్దరు కుమారులు సోను, ప్రవీణ్లతో పాటు డ్రైవర్ను వెంట తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్ పీర్యా(32) అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో నలుగురిని ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో పీర్యా(35) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వేణు, సోను, ప్రవీణ్ల పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో యోగా చేస్తున్న విద్యార్థులు
ప్రమాదంలో ఇద్దరు మృతి
ముగ్గురి పరిస్థితి విషమం

బ్రిడ్జి గుంతలో పడిన కారు

బ్రిడ్జి గుంతలో పడిన కారు