
బైక్పై నుంచి పడి వ్యక్తికి తీవ్రగాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన వేదపండితుడు దిగంబర శర్మ బుధవారం సాయంత్రం బైక్పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కాగా, దిగంబర శర్మ బైక్పై నుంచి పడడానికి జాతీయ రహదారి పనులు చేపడుతున్న కార్మికుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. గోపాల్పేట నుంచి మాల్తుమ్మెదకు దిగంబర శర్మ వెళ్తుండగా మాల్తుమ్మెద గేట్ సమీపంలో జాతీయ రహదారి పనులు చేపట్టిన కార్మికులు తారురోడ్డు ముక్కలను తొలగించి విసిరేసే క్రమంలో కొన్ని ముక్కలు ఆయన బైక్కు తగిలాయి. దీంతో బైక్పై నుంచి కిందపడిన ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో మెదక్ తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు హైదరాబాద్ తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కేసీపీ కార్మికుల తీరును నిరసిస్తూ స్థానిక నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై మల్లారెడ్డి అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. కేసీపీ జనరల్ మేనేజర్ రాంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొగా స్థానిక నాయకులు ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, హన్మంత్రెడ్డి తదితర నాయకులు ఆయనను నిలదీశారు. సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని రాంరెడ్డి హామీ ఇచ్చారు.
రోడ్డు పనుల్లో నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు సిద్ధమైన గ్రామస్తులు