
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఎల్లారెడ్డి: రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ విక్ట ర్ అన్నారు. బుధవారం అన్నాసాగర్లో నిర్వహిస్తు న్న సదస్సును ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి భూసమస్యలున్నా భూభారతి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులను అందించాలని సూచించారు. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్ తదితరులున్నారు.
గుజ్జుల్ తండాలో..
గాంధారి(ఎల్లారెడ్డి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. బుధవారం ఆయన గుజ్జుల్ తండాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
ఎల్లారెడ్డిరూరల్: అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. బుధవారం అన్నాసాగర్ గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారం వివరాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్, అంగన్వాడి టీచర్ దుర్గ తదితరులున్నారు.