
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
పెద్దకొడప్గల్/బిచ్కుంద(జుక్కల్): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం బిచ్కుంద, పెద్దకొడప్గల్ మండలాలలో నిర్వహించిన సదస్సులలో సబ్ కలెక్టర్ పాల్గొని పరిశీలించి మాట్లాడారు. భూ భారతితో ఎన్నో భూముల సమస్యలు పరిష్కరించారని తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా దరఖాస్తు పెట్టుకున్న వెంటనే అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. బిచ్కుందలో 141, పుల్కల్లో 209 మంది రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ భరత్.. పెద్దకొడప్గల్లో తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవి కాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.