
ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి
నిజామాబాద్నాగారం: జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ చేపడుతున్న దాడులు వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లాలోని గ్రామీణ ఆర్ఎంపీ, పీఎంపీలు సోమవా రం ర్యాలీ తీశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, జిల్లా అధ్యక్షులు భాస్కర్రాజు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై స్టేట్ మెడిక ల్ కౌన్సిల్ పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికేట్లు ఇచ్చి గుర్తించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కట్టా అశో క్, గరువ శ్రీనివాస్, రాజేశ్వర్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల అధ్యక్షుల రాజగోపాల్చారీ, సాయిలు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఆర్ఎంపీపై మహిళల దాడి
నిజామాబాద్నాగారం: ఆర్ఎంపీ, పీఎంపీలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అశోక్పై మహిళలు చెప్పులతో దాడి చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ, మాయమాటాలతో మోసం చేస్తున్నారని ఇద్దరు మహిళలు పేర్కొంటూ చెప్పుతో దాడి చేశారు. వైద్యం కోసం వెళ్తే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి