
డబుల్ బెడ్రూం ఇళ్లపై దాడులు
రెండేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించినా వాటిలో నివాసం ఉండటానికి ఇప్పటికీ అధికారులు అనుమతించడం లేదని భిక్కనూర్కు చెందిన లబ్ధిదారులు తెలిపారు. వారు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించినప్పటికీ వాటిలో నివాసం ఉండేలా ప్రక్రియను పూర్తి చేయలేదని అన్నారు. పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కొద్ది రోజులుగా తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లపై కొందరు ఆకతాయిలు దాడులు చేస్తూ కిటికీలు, తలుపులు, అద్దాలు, వాటర్ పైపులను ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. ధ్వంసమైన వాటికి మరమ్మతులు చేయించి.. కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.