
ధరణి వెంచర్ బాధితుల గోడును పట్టించుకోవాలి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్లో రాజీవ్ స్వగృహ, ధరణి వెంచర్లో ప్లాట్లు తీసుకున్న యజమానుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని ప్లాట్ల యజమానులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. 2022లో ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీతో ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పటికీ వెంచర్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. రోడ్లు, మురికికాలువలు, వీధి దీపాలు, నీటి సౌకర్యాలను ఆరు నెలల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని వాపోయారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.