ధరణి వెంచర్‌ బాధితుల గోడును పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ధరణి వెంచర్‌ బాధితుల గోడును పట్టించుకోవాలి

Jun 17 2025 5:03 AM | Updated on Jun 17 2025 5:03 AM

ధరణి వెంచర్‌ బాధితుల గోడును పట్టించుకోవాలి

ధరణి వెంచర్‌ బాధితుల గోడును పట్టించుకోవాలి

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్‌లో రాజీవ్‌ స్వగృహ, ధరణి వెంచర్‌లో ప్లాట్లు తీసుకున్న యజమానుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని ప్లాట్ల యజమానులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. 2022లో ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీతో ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పటికీ వెంచర్‌లో కనీస సౌకర్యాలు లేవన్నారు. రోడ్లు, మురికికాలువలు, వీధి దీపాలు, నీటి సౌకర్యాలను ఆరు నెలల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని వాపోయారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement