ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

Jun 17 2025 5:03 AM | Updated on Jun 17 2025 5:03 AM

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పోటెత్తారు. మొత్తం 135 వినతులు వచ్చాయి. ప్రధానంగా భూ సమస్యలు, డబుల్‌ బెడ్రూం ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమస్యలను పరిస్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారునికి సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చందర్‌ నాయక్‌, ఆర్డీవో వీణ, ఏవో మస్రూర్‌ అహ్మద్‌, వివిధ శాఖల జిల్లా అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదుదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement