
పాఠశాలను తరలించొద్దు
బీబీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను మరో చోటకు తరలించవద్దని కోరుతూ విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ఇటీవల జూనియర్ కళాశాలకు కేటాయించారని తెలిపారు. ఎన్నో యేళ్లుగా తమ ఆడపిల్లలు చదువుకుంటున్న బాలికల పాఠశాలను మరోచోట ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలోకి మారుస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. ఈ మార్పుతో బాలికల విద్యపై, భద్రతపై ప్రభావం పడుతుందన్నారు. బాలికలకు ప్రత్యేకంగా పాఠశాల ఉండాల్సిన అవపసరం ఉందన్నారు. బాలికల ఉ్ననత పాఠశాలను అదే భవనంలో కొనసాగించాలని కలెక్టర్కు విన్నవించారు.