
విద్యుత్ షాక్తో ఒకరికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలో సోమ వా రం గ్రామపంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండలోని స్థానిక సాయిబాబా గుడి కాలనీలో విద్యుత్ స్తంభాలకు బల్బులను సరిచేయడానికి ట్రా న్స్ఫార్మర్ వద్ద విద్యుత్ నిలిపివేశారు. అనంతరం వెంకట్రెడ్డి పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు ఇనుప స్తంభానికి తగలడంతో అతడికి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వారు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పంచాయతీ కార్మికుడికి గాయాలైనట్లు పేర్కొన్నారు.
ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు
ఎల్లారెడ్డి: మండలంలోని హాజీపూర్ తండాలోగల సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ఈనెల 14న రాత్రి చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై మహేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన గడ్డండ్ల పౌల్ అనే వ్యక్తి ఈనెల 14న తండాలోని ఆలయ హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించాడు. తండాలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.
కోర్టు పేషీలకు హాజరుకాని మహిళ రిమాండ్..
ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు పరిధిలో దొంగతనం కేసులో రిమాండయిన ఓ మహిళ కోర్టు పేషిలకు హాజరు కాకుండా తిరుగుతోంది. దీంతో సదరు మహిళపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో అమెను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్ షాక్తో ఒకరికి గాయాలు