
స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి
కామారెడ్డి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఇటీవల ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం మండలంలోని జంగంపల్లి, భిక్కనూర్ గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని సూచించారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. జంగంపల్లి మాజీ ఎంపీటీసీ పుల్లూరి రామస్వామి, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు, తదితరులున్నారు.
మొక్కలు నాటిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. ఫాదర్స్ డే సందర్భంగా గుర్తుగా మొక్కలు నాటినట్టు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎం.జైపాల్రెడ్డి, పి.రాజేశ్వరరావు, పాత హన్మాండ్లు, పంపరి శ్రీనివాస్, భాస్కర్, రాజనర్సింహారెడ్డి తదితరులున్నారు.
ముంబోజిపేటతండాలో.. యువకులు
లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజిపేట తండాలో యువకులు మొక్కలు నాటారు. ఐదేళ్ల నుంచి తండా పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. తండాకు చెందిన ఉద్యోగులు, యువకులు స్వయంగా మొక్కలు కొనుగోలు చేసి నాటినట్లు పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి