నిలిచిన చెక్‌డ్యాం పనులు | - | Sakshi
Sakshi News home page

నిలిచిన చెక్‌డ్యాం పనులు

Jun 16 2025 5:55 AM | Updated on Jun 16 2025 5:55 AM

నిలిచిన చెక్‌డ్యాం పనులు

నిలిచిన చెక్‌డ్యాం పనులు

బాన్సువాడ : బీర్కూర్‌ వద్ద మంజీర నదిలో కొనసాగుతున్న చెక్‌ డ్యాం నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. వర్షాల కారణంగా మంజీర నదిలో నీటి ప్రవాహం ప్రారంభమైంది. దీంతో చెక్‌ డ్యాం పనులకు ఆటంకం ఏర్పడడంతో నిర్మాణ పనులను నిలిపివేశారు. బీర్కూర్‌ మంజీరలో చెక్‌ డ్యాం పనులు ఒక్క అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లు కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్న చెక్‌ డ్యాం పనులు మందకొడిగా సాగుతూనే ఉన్నాయి. అప్పటి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మంజీర నదిపై చెక్‌ డ్యాం నిర్మించాలని నాబార్డు నిధులు రూ.28.29 కోట్లతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా 28 జనవరి 2021లో శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లుగా పనులు కొనసాగు..తూనే ఉన్నాయి. గత మే 22న ఇరిగేషన్‌ క్వాలిటీ కంట్రోల్‌ సీఈ వెంకటకృష్ణ చెక్‌ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు పూర్తయితే బీర్కూర్‌తో పాటు కిష్టాపూర్‌, బరంగెడ్గి, డోంగ్లీ మండలం కుర్లా, శేట్లూర్‌, ఖడ్‌గాం గ్రామాలకు భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారులు స్పందించి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల రైతులు వేడుకుంటున్నారు.

నాలుగేళ్లుగా కొనసాగుతున్న వైనం

మంజీరలో నీటి ప్రవాహంతో

పనులకు బ్రేక్‌

ఎప్పుడు పూర్తవుతుందో

తెలియని పరిస్థితి

త్వరగా పూర్తి చేయాలని

కోరుతున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement