
ఆలయంలో చోరీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు తండావాసులు ఆదివారం తెలిపారు. ఆలయంలో శనివారం పూజలు చేసి వెళ్లిన పూజారి దుష్యానాయక్ ఆదివారం ఉదయం గుడిని తెరిచేందుకు వెళ్లగా ఆలయంలోని హుండీ బయట ఉండటాన్ని గమనించి తండావాసులకు సమాచారం ఇచ్చారు. హుండీని పరిశీలించిన తండా వాసులు అందులో సుమారు రూ. 30వేల నగదు ఉన్నదని, గుర్తుతెలియని దుండుగులు చోరీ చేశారన్నారు. ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
షాపు యజమానిపై కత్తితో దాడి
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో బట్టల షాపు నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్త షేక్ ఖలీల్పై ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బట్టలు కొనుక్కోడానికి వచ్చిన నిందితుడికి ఖలీల్ బట్టలు చూపిస్తుండగా హఠాత్తుగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. షాపులో ఉన్న వర్కర్లు, స్థానికులు వెంటనే గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్పృహకోల్పోయిన ఖలీల్ను వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని పట్టుకుంటామని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.