
మానవత్వం చాటుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్
భిక్కనూరు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన మెదక్ నుంచి కారులో భిక్కనూరుకు వస్తుండగా.. 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఉండడాన్ని గమనించారు. కలెక్టర్ సీసీ రాజశేఖర్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. దీనిని గమనించిన చంద్రకాంత్రెడ్డి గాయపడిన వారిని బయటకు తీయడంలో సహకరించి, అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రావడంలో ఆలస్యం కావడంతో తన కారులో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
కామారెడ్డి: ఆయకట్టు పంట పొలాలకు సాగు నీరు అందించే పంట కాలువలు, తూముల మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయించాలని జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావు నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి శివారులోని పెద్ద చెరువు ప్రధాన కాలువ మరమ్మతు పనులను పరిశీలించారు. పంట కాలువ మరమ్మతులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఆయకట్టు పంట పొలాలకు సాగు నీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.
రైతు భరోసాకు
దరఖాస్తు చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): అర్హులైన రైతులు వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసా య అధికారి అనిల్కుమార్ సూచించారు. ఈనెల 5వ తేదీలోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రైతులు సంబంధిత గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తీర్ణాధికారుల వద్ద ఈనెల 20 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్లో పట్టాదారు డాటా డిజిటల్ సంతకం అయిన రైతులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులే అని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, డిజిటల్ సంతకం అయిన పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్ అకౌంట్ జిరాక్స్తో పాటు దరఖాస్తు ఫారంను ఏఈవోలకు అందజేయాలని సూచించారు.

మానవత్వం చాటుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్