
రైతు నేస్తం మరింత చేరువ!
● మరో 47 రైతు వేదికల్లో
వీసీ యూనిట్ల ఏర్పాటు
● ప్రతి మంగళవారం
కార్యక్రమాల నిర్వహణకు అవకాశం
● నేడు వర్చువల్ విధానంలో
ప్రారంభించనున్న సీఎం
కామారెడ్డి క్రైం : రైతు నేస్తం కార్యక్రమాన్ని మరింత చేరువ చేయడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం యూనిట్లను ఏర్పాటు చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్య వసాయ విశ్వవిద్యాలయం నుంచి సీఎం రేవంత్రె డ్డి నిర్వహించే కార్యక్రమంలో వీటిని వర్చువల్గా ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల మధ్య నిర్వహించే వీసీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా వ్యవసాయ అధి కారి తిరుమల ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా కోరారు.
72 రైతువేదికల్లో వీసీ యూనిట్లు..
జిల్లాలో గతంలో 25 రైతుల వేదికల్లో మాత్రమే వీడి యో కాన్ఫరెన్స్ యూనిట్లు ఉండేవి. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల జిల్లాకు మరో 47 యూనిట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో మొత్తం 72 రైతు వే దికలకు వీసీ యూనిట్లు అందుబాటులోకి వచ్చా యి. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేసే ఉద్దేశంతో వీసీ యూనిట్లను ఏర్పా టు చేశారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, సాగులో మెలకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన సాగు పద్ధతు లు, సాంకేతికతను ఎప్పటికప్పుడు రైతులకు చేరవే యడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సందేహాలను వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తారు. పంటల సాగులో అ వసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు.