
నాన్న కష్టం వల్లే ఉన్నత స్థాయికి..
మాచారెడ్డి: నాన్న ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ చదివించారని, ఆయన కష్టం వల్లే తాను బ్యాంక్ మేనేజర్ అయ్యానని చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సురేష్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా సాక్షితో తన తండ్రి కష్టాన్ని వివరించాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నప్పటికీ తనను బాగా చదివించడం కోసం తన తండ్రి మరింత కష్టపడ్డారన్నారు. వారి కష్టాలను తీర్చేందుకు బాగా చదివానని, 2017లో బ్యాంకు పీవోగా ఉద్యోగం సంపాదించానన్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్నానన్నారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్యల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు.