పిల్లల కోసం కష్టపడ్డారు.. | - | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం కష్టపడ్డారు..

Jun 15 2025 7:28 AM | Updated on Jun 15 2025 7:28 AM

పిల్ల

పిల్లల కోసం కష్టపడ్డారు..

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిదిలోని దుబ్బ తండాకు చెందిన కాట్రోత్‌ మంగ త్యా నాయక్‌ తండా కు పెద్ద నాయకుడే అయినా తండాలోనే అతి పేద రైతు. తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసా యం చేస్తూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు న్నా తన ముగ్గురు పిల్లలు సుజాత, రమేష్‌, సురే ష్‌ను ఉన్నత చదువులు చదివించాడు. సుజాత బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసింది. నర్సింగ్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది. పెద్ద కుమారుడు రమేష్‌ జూనియర్‌ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు సురేష్‌ ఎస్‌బీఐ క్లర్క్‌ ఉద్యోగం సాధించాడు. అదే తండాకు చెందిన దేవుసోత్‌ చంద్య్రా దంపతులు వ్యవసాయం చేస్తూ తన కుమారుడు ప్రేమ్‌సింగ్‌ను చదివించారు. దీంతో ప్రేమ్‌సింగ్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నాడు. మండల కేంద్రానికి చెందిన హరాళే రావుసాహెబ్‌ రావు వ్యవసాయం చేస్తూ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు ధీరజ్‌ బీటెక్‌ పూర్తి చేసి ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు సౌరభ్‌ లక్నోలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై , ఏడాదికి రూ. 40లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తన ఇద్దరు కుమారులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు పొందడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉంచాలని తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా తమ పిల్లలను కష్టపడి ఉన్నత స్థాయిలో నిలిపిన తండ్రుల వివరాలతో ‘సాక్షి ప్రత్యేక కథనం..

ఉజ్వల భవిష్యత్‌ కోసం

తల్లిదండ్రుల తాపత్రయం

నేడు ఫాదర్స్‌ డే

పిల్లల కోసం కష్టపడ్డారు.. 1
1/2

పిల్లల కోసం కష్టపడ్డారు..

పిల్లల కోసం కష్టపడ్డారు.. 2
2/2

పిల్లల కోసం కష్టపడ్డారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement