
సామరస్య పరిష్కారం కోసమే లోక్ అదాలత్
బిచ్కుంద(జుక్కల్): ఇరువర్గాల కక్షిదారులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వినిల్ కుమార్ అన్నారు. బిచ్కుంద కోర్డులో శనివారం జడ్జి అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. చాలామంది క్షణికావేశానికి లోనై ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఈసందర్భంగా రెండు వర్గాలు రాజీ కుదుర్చుకోవడంతో భూ తగాదాలు, క్రిమినల్ కేసులు, డ్రంకెన్డ్రైవ్, బ్యాంక్ తదితర 273 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. డ్రంకెన్డ్రైవ్లో రూ.509,800 జరిమానా విధించారు. బ్యాంకు కేసులలో రూ.8లక్షల 7వేలు రికవరీ చేసి కేసులు పరిష్కరించారు. న్యాయవాదులు లక్ష్మణ్రావు, మల్లేశ్వర్, విఠల్, ప్రకాష్, శివాజీ, మహ్మద్, శ్రీనివాస్ కోర్డు సిబ్బంది పాల్గొన్నారు.
బాన్సువాడ: బాన్సువాడ కోర్టులో శనివారం జడ్జి భార్గవి ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ ఆదాలత్లను కక్షిదారులు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. న్యాయవాదులు లక్ష్మినారాయణమూర్తి, రమాకాంత్, దత్తాత్రిరావు, ఆనంద్, మోహాన్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్లో 322 కేసులను పరిష్కరించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ రవీందర్నాయక్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట ఎస్సైలు మహేష్, వెంకట్రావ్, మల్లారెడ్డి, ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్, న్యాయవాదులు పండరి, సతీష్, సాయిప్రకాష్ దేశ్పాండే, సాయిబాబా, శ్రీకాంత్, నవీద్ తదితరులున్నారు.

సామరస్య పరిష్కారం కోసమే లోక్ అదాలత్

సామరస్య పరిష్కారం కోసమే లోక్ అదాలత్