
దేశీదారు పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మద్నూర్ మండలం రుశేగావ్ చౌరస్తా వద్ద శనివారం 10 దేశీదారు మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు బిచ్కుంద ఎక్సైజ్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రుశేగావ్ నుంచి ద్విచక్ర వాహనంపై దేశీదారు మద్యం తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు చౌరస్తా వద్ద ద్విచక్ర వా హనదారుడుని పట్టుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశీదారు తరలిస్తున్న బండి సురేశ్తోపాటు దిగంబర్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇందల్వాయి: మండలంలోని లోలం వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తు న్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మే రకు వెళ్లి చూడగా ట్రాక్టర్ డ్రైవర్ల వద్ద అ నుమతి పత్రాలు లేవన్నారు. దీంతో కేసు న మోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి చ ర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

దేశీదారు పట్టివేత