
నీట్లో మెరిసిన బంజపల్లివాసి
మాచారెడ్డి: బంజపల్లికి చెందిన అజ్మీర అశుతోష్ శనివారం వెలువడిన నీట్ ఫలితాల్లో 570 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5 వేలు, ఎస్టీ కేటగిరీలో 32వ ర్యాంక్ సాధించాడు. అశుతోష్ తల్లిదండ్రులు శాంత, లింగం ఉపాధ్యాయులు. ఉత్తమ ర్యాంక్ సాధించిన అతడిని గ్రామస్తులు అభినందించారు.
బిచ్కుంద వాసి..
బిచ్కుంద: మండల కేంద్రానికి చెందిన రచ్చ శ్రీవేద శృతిక నీట్ పరీక్షలో 586 మార్కులతో ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరిలో 927 ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి రచ్చ శివకాంత్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
‘అన్ని వర్గాలకు
అండగా మోదీ సర్కార్’
కామారెడ్డి టౌన్: అన్ని వర్గాలకు అండగా కేంద్రంలోని మోదీ సర్కార్ నిలుస్తోందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 ఏళ్లవుతున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం ప్రధానిగా మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారన్నారు. ఆయన హయాంలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం మోదీ విజయాలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంపై బీజేపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్రెడ్డి, రవీందర్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు విపుల్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు నరేందర్, శ్రీనివాస్, సురేష్, వేణు, సంతోష్రెడ్డి, రవీందర్, రాజు పాల్గొన్నారు.
‘పారదర్శకంగా బదిలీలు నిర్వహించాం’
కామారెడ్డి క్రైం: జిల్లా పోలీస్ శాఖలో బదిలీ ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 79 మంది హోంగార్డులు, 63 మంది సివిల్, ఏడుగురు ఎంప్టీ సెక్షన్ ఏఆర్ కానిస్టేబుళ్లు, 20 మంది సివిల్ హెడ్కానిస్టేబుళ్లు, 23 మంది ఏఎస్సైలకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను నిర్వహించామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రూ.40 లక్షలతో పరారీ
ఖలీల్వాడి: నిజామాబాద్ ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ఓ ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి ఏటీఎంలో డిపాజిట్ చేసే నగదు తీసుకొని పారిపోయినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలి పారు. వివరాలిలా ఉన్నాయి. ఎల్లమ్మగుట్ట వద్ద ఉన్న ప్రయివేటు ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులను డిపాజిట్ చేస్తారు. శనివారం ఉదయం విధులకు వచ్చిన న్యాల్కల్ రోడ్కు చెందిన రమాకాంత్ రూ.40 లక్షల 50 వేలు ఏజెన్సీ వద్ద ఉన్న వాహనంలో పెడుతుండగా ఎత్తుకొని పరారైనట్లు చెప్పారు. రమాకాంత్ ఎత్తుకెళ్లిన డబ్బులను బోధన్లోని ఓ బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాకు అవార్డు
రావడంపై హర్షం
కామారెడ్డి అర్బన్: రక్తదానంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెడ్క్రాస్ సోసైటీ రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డును అందుకోవడంపై టీఎన్జీవోస్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రక్తదానంలో ఉద్యోగులు సైతం భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. జిల్లాకు అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రెడ్డి, నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.

నీట్లో మెరిసిన బంజపల్లివాసి

నీట్లో మెరిసిన బంజపల్లివాసి