తాగునీటి కోసం ధర్నా | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ధర్నా

Jun 15 2025 7:26 AM | Updated on Jun 15 2025 7:26 AM

తాగునీటి కోసం ధర్నా

తాగునీటి కోసం ధర్నా

గాంధారి: బ్రాహ్మణపల్లి గ్రామంలో 15 రోజులుగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు శనివారం ఖాళీ బిందెలతో పంచాయతీ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజులుగా మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని, గ్రామంలో ఉన్న రెండు బోర్లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఈ విషయమై కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల ధర్నాతో అధికారులు స్పందించారు. మధ్యాహ్నం వరకు మరమ్మతులు చేసి తాగు నీటి సరఫరాను పునరుద్ధరించారు. మోటార్లు పాడైపోవడం, వైర్లు తెగిపోవడంతో బోరుబావులు నడవడం లేదని పంచాయతీ కార్యదర్శి సరస్వతి పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో మిషన్‌ భగీరథ నీరు రావడం లేదన్నారు. బోర్లకు శనివారం మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించామన్నారు.

బ్రాహ్మణ్‌పల్లిలో ధర్నా చేస్తున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement