మహమ్మద్‌నగర్‌లో రోడ్డెక్కిన ప్రజలు | - | Sakshi
Sakshi News home page

మహమ్మద్‌నగర్‌లో రోడ్డెక్కిన ప్రజలు

Jun 15 2025 7:26 AM | Updated on Jun 15 2025 7:26 AM

మహమ్మద్‌నగర్‌లో రోడ్డెక్కిన ప్రజలు

మహమ్మద్‌నగర్‌లో రోడ్డెక్కిన ప్రజలు

నిజాంసాగర్‌: ‘‘నల్లా నీళ్లు రాక వారం రోజులాయె.. గొంతు తడపుకునేందుకు గుక్కెడు నీళ్లు దిక్కు లేవు’’ అంటూ మహమ్మద్‌నగర్‌వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మహమ్మద్‌నగర్‌ పంచాయతీ పరిధిలోని జంగాల కాలనీవాసులు బస్టాండ్‌ వద్ద ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం, గ్రామ పంచాయతీ బోరు మోటార్లు చెడిపోవడంతో తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement