
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
దోమకొండ/తాడ్వాయి/నస్రుల్లాబాద్/సదాశివనగర్ : భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించిందని తహసీల్దార్ సుధాకర్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో భూభారతి సదస్సులు ముగిసినట్లు వివరించారు. తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్వేత మాట్లాడారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సువర్ణ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామానికి చెందిన 40 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామన్నారు. సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్లు రేఖ, తిరుపతి, ఆర్ఐలు వెంకట స్వామి, సాహిత్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ సుధాకర్
ముగిసిన రెవెన్యూ సదస్సులు