
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ
బాన్సువాడ రూరల్/కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/నస్రుల్లాబాద్ / మాచారెడ్డి : విద్యార్థులకు పలు చోట్ల ఉపాధ్యాయులు శుక్రవారం పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం బోర్లం జెడ్పీహైస్కూల్లో హెచ్ఎం వెంకట రమణ. రెడ్క్రాస్ బాన్సువాడ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్రెడ్డిలతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాంలను పంపిణీ చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థు లకు ఒక జత యూనిఫాం అందజేశారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో ఎంపీడీవో సూర్యకాంత్ విద్యార్థులకు పుస్తకాలు,యూనిఫాంలు అందించారు. మాచారెడ్డి మండలం లచ్చాపేటలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.