గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Jun 14 2025 7:39 AM | Updated on Jun 14 2025 7:39 AM

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

ఖలీల్‌వాడి: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ స్వప్న శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ నగరంలోని జకీర్‌ఫామ్‌ హౌజ్‌లో తనిఖీ చేయగా షేక్‌ షకీల్‌ అనే వ్యక్తి వద్ద 134 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అతడిని విచారించగా మధుకర్‌ వద్ద తాను గంజాయి కొనుగోలు చేశానని చెప్పాడు. వెంటనే మధుకర్‌ ఇంటి వద్ద తనిఖీలు చేసి 50 గ్రాముల గంజాయి సీజ్‌ చేశారు. షకీల్‌, దాతే మధుకర్‌తోపాటు దాగే దాతూరాం ముగ్గురు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి పట్టుబడిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాలు విక్రయించే వారికి సంబంధించిన సమాచారాన్ని 87126 58970 నంబర్‌కు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ అన్నారు. ఎక్సైజ్‌ ఎస్సై రాము, హెడ్‌కానిస్టేబుల్‌ చిట్టి నారాయణరెడ్డి, హమీద్‌, శివ, ప్రీతమ్‌, అవినాష్‌, భోజన్న, విష్ణు, రాజన్న పాల్గొన్నారు.

దాడి కేసులో ఆరుగురు..

మోర్తాడ్‌(బాల్కొండ): మండల కేంద్రంలో రొయ్యల సురేశ్‌ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం దాడికి పాల్పడిన ఆరుగురిని ఆరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విక్రమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రొయ్యల సురేశ్‌ కారులో వెళ్తుండగా రొడ్డుకు అడ్డంగా బైక్‌ నిలిపిన మహ్మద్‌ షాహబాజ్‌, అబ్దుల్‌ మజార్‌ను బైక్‌ తీయాలని అనడంతో వారు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సురేశ్‌పై బైక్‌ను పడేసి తలపై రాడ్‌తో కొట్టారని, వారికి మహ్మద్‌ అస్లాం, అబ్దుల్‌ మాలిక్‌, అబ్దుల్‌ అర్భాజ్‌, మహ్మద్‌ ఫయాజ్‌లు మద్దతు తెలుపుతూ దాడికి ఉసిగొలుపుతూ బూతులు తిట్టారని తెలిపారు. తన భర్తపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్‌ భార్య సౌమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement