
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2026 సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధమయ్యే వారికి ఉచితంగా లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఉచిత కోచింగ్ హైదరాబాద్లోని లక్ష్మీనగర్లో ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న వారిలో వందమంది ప్రతిభావంతులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 08462 241055 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
కక్షిదారు వద్దకు న్యాయమూర్తి
ఆర్మూర్టౌన్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆర్మూర్ కోర్టులో శుక్రవారం కొ ట్లాట కేసులో ఇరువురు రాజీపడ్డారు. అయి తే నడవలేని స్థితిలో ఉన్న కక్షిదారు దగ్గరకే న్యాయమూర్తి సరళ రాణి వచ్చారు. ఈ కేసులో రాజీ కుదిర్చారని ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
ఆస్పత్రిలో రోగి భర్త ఆత్మహత్య
ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మద్ నగర్కు చెందిన సాయిలు (38) గురువారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు భార్య సంగీతను అనారోగ్యం కారణంగా ఈ నెల 6న ఆస్పత్రిలో చేర్పించారు. సంగీత రక్త హీనతతో బాధపడుతుండగా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన సాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.